Thursday, April 25, 2024
- Advertisement -

శ్రీలంక‌లో భీక‌ర ఎన్ కౌంట‌ర్‌….15 మంది మృతి

- Advertisement -

వ‌రుస బాంబు పేళుల్ల‌తో అట్ట‌డుకుతున్న శ్రీలంకంలో భారీ ఎన్ కౌంట‌ర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో 15 మంది మృతి చెందారు. సమ్మంతురై అనే ప్రాంతంలో తమను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలియడంతో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. కొంతసేపు ఎదురుకాల్పుల తర్వాత ఆ ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో కనీసం 15 మంది చనిపోయినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే) సభ్యులుగా అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -