ఆర్ కామ్ అధినేత అనీల్ అంబాని తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అనిల్కు మరో ఎదురు దెబ్బ గలిలింది. స్వీడన్కు చెందిన టెలికం సంస్థ ఎరిక్సన్ ఇండియా వివాదంలోసుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎరిక్సన్కు 4 వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్కాం ఎరికసన్ బకాయిలను చెల్లించడంలో ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది. ఇందుకు అనిల్ అంబానీతో పాటు ఇద్దరు డైరెక్టర్లను (రిలయన్స్ టెలికం ఛైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ అధ్యక్షురాలు ఛాయా విరాని) ఈ కేసులో దోషులుగా సుప్రీం తేల్చింది. ఒక్కొక్కరికీ కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. 4 వారాల్లో ఈ సొమ్మును చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మరోవైపు అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలన్న ఎరిక్సన్ పిటీషన్ను తోసిపుచ్చింది.