చైనాలోని ఓ కెమికల్ పరిశ్రమకు దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర చైనాలోన ప్యాక్టరీలో జరిగిన ఈ ఘోరప్రమాదంలో మరో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు.చైనా రాజధాని బీజింగ్కు దాదాపు 200 కి.మీ.ల దూరంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా దాదాపు 50 ట్రక్కులు దగ్ధమయ్యాయి. బుధవారం రాత్రి 12:41 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాద వివరాలను చైనీస్ మీడియా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియచేసింది.
పేలుడు కారణంగా ఫ్యాక్టరీ మొత్తం మంటలు అంటుకున్నాయి. దీంతో.. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు 20మంది కార్మికులు సజీవదహనమవ్వగా… మరో 20 మంది తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న దాదాపు 50 కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదం కెమికల్ ఫ్యాక్టరీ అతి సమీపంలో జరగడంతో మంటలు పరిశ్రమ దాకా వ్యాప్తించే ప్రమాద తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉండేదని అదికారులు తెలిపారు.