Friday, April 19, 2024
- Advertisement -

విజ‌య‌వాడ‌లో దారుణం..మూకుమ్మ‌డిగా రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబం

- Advertisement -

విజ‌య‌వాడ‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రైల్వే పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..రాయవేలూరుకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య జయంతి(29), కుమార్తె శ్రీలక్ష్మీ(3), పెదనాన్న గోపాల కృష్ణన్‌(65)లు గురువారం విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

గత నెల 27వ తేదీన క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ భార్య జయంతి తన ఇద్దరు కూతుళ్లతో పాటు వరుసకు తండ్రయ్యే గోపాలకృష్ణతో కలిసి వేలంగిని మాత ఆలయానికి వెళ్లారు. ఆల‌య అథిది గృహంలో పెద్ద‌కూతురు మ‌హాల‌క్ష్మి అనుమానాస్ప‌దంగా మృతి చెందింది. జ‌యంతి భ‌ర్త‌, కుటుంబ స‌భ్యులు గోపాలకృష్ణపై అనుమానం చేయ‌డంతో ..నిందను భరించలేక జయంతి తన చిన్నకూతురు శ్రీలక్ష్మి, గోపాలకృష్ణన్‌లు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -