దేశంలో ఏ విపత్తు సంభవించినా తన వంతు సహాయ, సహకారాలు అందించడంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. కెనడా పౌరసత్వం ఉన్న అక్షయ్ కుమార్ భారత్లో ఎలా నివసిస్తున్నాడంటూ ఇటీవల ఆయనపై విపరీతమైన విమర్శలు సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే.
ఏడేళ్ళుగా భారత్లోనే ఉంటున్న తాను పలు రకాల పన్నులు కూడా కడుతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయోద్దని కూడా కోరాడు అక్షయ్. కెనడా పౌరసత్వం ఉన్నప్పటికి భారతీయుల కోసం ఎన్నోసహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆపదలో ఉన్న వారికి తనవంతు సాయంగా ఎంతో కొంత విరాళాలు అందించారు. రీసెంట్గా పుల్వామా ఉగ్ర దాడి బాధితుల కుటుంబాలకు తన వంతు సాయాన్ని అందించాడు. ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకి 5 కోట్ల విరాళాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నాడు.
తాజాగా ఫణి తుఫానుతో అతలాకుతలం అయిన ఓడిషాను ఆదుకొనేందుకు అక్షయ్ ముందుకొచ్చాడు. తుపాను బాధితుల సహాయంకోసం తన వంతుగా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నారు.ఈ మొత్తాన్ని ఒడిశా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించాడు. ఈ సందర్భంగా అక్షయ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.