Thursday, April 25, 2024
- Advertisement -

మ‌గ ఏనుగు లైంగిక దాడిలో చ‌నిపోయిన ఆడ ఏనుగు..

- Advertisement -

మ‌గ ఏనుగు బ‌ల‌వంత లైంగిక దాడిలో ఆడ ఏనుగు మృతిచెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో కౌండిన్య రిజర్వ్ ఫారెస్టులో ఈ విస్మయం గొలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ బీట్ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే స్థానికులు, అధికారులు అనారోగ్యం కార‌ణంగా లేకుంటె విష ప‌దార్థం ఏదైనా తిని చ‌నిపోయిఉంటుంద‌ని భావించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయం బయటపడింది. పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ బీట్‌ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో పశువుల కాపర్లు రెండు రోజుల కిందట ఒక ఏనుగు మృతదేహాన్ని గుర్తించారు. ఆఏణుగు ప‌క్క‌నె మ‌రో చిన్న ఏనుగు దీనంగా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు అధికారుల‌ను స‌మాచారం అందించారు. ఏనుగు మృత దేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు అధికారులు. అది లైంగిక దాడికి గురవడం వల్లే మరణించిందని తేల్చారు.కాగా మృతి చెందిన ఏనుగుతో పాటు మరో పిల్ల ఏనుగు ఉండేదని అది ఎక్కడికి వెళ్లిందో తెలియలేదని స్థానికులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -