- Advertisement -
ఉత్తరప్రదేశ్లోని పిలిభిట్ జిల్లా బెనిపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి సంఘటన స్థానికింగా కలకలం రేపింది. మరణించిన వారంతా గ్రాజ్(60), అతని భార్య రమాదేవి(50), కుమారుడు నేమ్ చంద్ర(32), కోడలు మమతా దేవి(28), కుమార్తె(26)లుగా గుర్తించారు పోలీసులు.
కుటుంబ సభ్యలంతా పాలల్లో విషయం కలుపుకుని తాగడంతో మృత్యువాతపడినట్లు జిల్లా జిల్లా సూపెరిండెంట్ ఆప్ పోలీసు వాలెందు భూషణ్ తెలిపారు.షాంపిల్ తీసుకొని లేబరేటరీలో పరీక్ష అనంతరం అసలు విషయం తెలిసింది’’ అని అన్నారు. మృత దేహాలను పోస్ట్మార్టంకి పంపించామని.. పోస్ట్మార్టం రిపోర్టులు వచ్చాక.. వాటి ఆధారంతో అన్ని కోణాల్లో దర్యప్తు చేస్తామని తెలిపారు.