Friday, March 29, 2024
- Advertisement -

క‌రెంటు షాక్‌తో పెళ్లికొడుకు సహా నలుగురు మృతి…

- Advertisement -

క‌రెంటు న‌లుగురిని కాటేసింది.పెళ్లయిన రెండోరోజే పెళ్లికొడుకు, అతడి తల్లిదండ్రులు, మేనత్త కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పెను విషాధం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే పెళ్లైన యువకుడు కూడా ఉండడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

పోలీసుల కథనం ప్రకారం.. భూదాన్‌ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్తాపూర్‌ గ్రామానికి చెందిన చిందం ప్రవీణ్‌(22)కు ఈ నెల 19న ఓ యువతితో పెళ్లి జరిగింది. పెళ్లికుమార్తె ఇంటి వద్ద కార్యక్రమాలను ముగించుకున్న ప్రవీణ్ కుటుంబం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిట్లో విద్యుత్ బల్బులను అమర్చేందుకు ఓ ఇనుప తీగను ఏర్పాటు చేశారు. దానిని ఓ స్తంభానికి కట్టారు. అదే ఇనుప స్తంభానికి దుస్తులు ఆరేసే తీగను కూడా కట్టారు. పెళ్లి కుమారుడి తల్లి ఇదే తీగపై బట్టలు ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగింది. విద్యుదాఘాతానికి గురైన ఆమెను రక్షించేందుకు వెళ్లిన నలుగురు కూడా షాక్‌కు గురయ్యారు.

నలుగురిని బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పెళ్లికుమారుడు చిందం ప్రవీణ్‌(22), అతడి తల్లిదండ్రులు సాయిలు(55), గంగమ్మ(50), వలిగొండ మండలం తుమ్మలగూడేనికి చెందిన పెళ్లి కుమారుడి మేనత్త గంగమ్మ(48) ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల ముందు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నిండుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -