Friday, April 26, 2024
- Advertisement -

మ‌ర‌ణంలోనూ వీడ‌ని స్నేహ‌బంధం….

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే గ్రామాణికి చెందిన ముగ్గురు బైక్ ఆయ్సిడెంట్‌లో మృతి చెందారు. ఈ ఘ‌ట‌న అశ్వ‌రావుపేట మండ‌లం నందిపాడులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెల్తే….గ్రామానికి చెందిన ఊకే కిషోర్‌(27), కారం వీరభద్రం(29), కుంజా జోగారావు(28)తో పాటు ధర్ముల ముత్తేశ్వరరావు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై ఆదివారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరుకు వెళ్లారు.

పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు మలుపు వద్ద వీరి బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. దీనిని గమనించిన గ్రామస్తులు అశ్వారావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కిశోర్, వీరభద్రం, జోగారావు మరణించగా.. ముత్తేశ్వరరావు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో వీరభద్రానికి వివాహం కాగా, ఏడాదిన్నర వయసున్న కుమార్తె, భార్య ఉన్నారు.

కిషోర్, జోగారావులకు ఇంకా పెళ్లి కాలేదు. సమాచారంఅందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు యువకులూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అందరూ నిరుపేదలే. కిషోర్‌ అశ్వారావుపేటలో బీఈడీ చదువుతుండగా, వీరభద్రం బీఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. జోగారావు ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ముగ్గురు మిత్రులు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -