ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనె ఉన్నాయి. తాజాగా ఢిల్లీ విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు ముగ్గురు కామాంధులు.
వివరాల్లోకి వెల్తే…రెండు నెలల క్రితం ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన 31 ఏళ్ల మహిళ మదనగిరి ప్రాంతంలో స్నేహితులతో కలిసి నివసిస్తోంది. వసంత్ కుంజ్ ఏరియాలో స్కార్పియో వాహనంలో తిప్పుతూ ముగ్గురు కలిసి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. తనపై అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు గురుగ్రామ్కు చెందిన వారని ఆమె తెలిపింది. అతడిని ఏడు నెలల క్రితం కలిశానని పోలీసులకు చెప్పింది. ఇద్దరం స్నేహితులమయ్యామని.. శనివారం వసంత్ కుంజ్ సమీపంలోని ఓ మాల్కు తనను ఆహ్వానించాడని తెలిపింది. అదే సమయంలో అతనితో పాటు ఇద్దరు స్నేహితులు ఉన్నారని చెప్పింది.
కారులో వెల్తుండగా వారు అసభ్యంగా ప్రవర్తించారని…బలవంతంగా లైంగిక దాడి చేసి తర్వాత తను ఉంటోన్న అపార్ట్మెంట్ సమీపంలో దింపేసి వెళ్లారని చెప్పింది. నడుచుకుంటూ తన ఫ్రెండ్ నివాసానికి వెళ్లిన ఆమె… జరిగిన దారుణాన్ని వివరించింది. ఆమెను ఆసుప్తరికి తీసుకెల్లగా అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇాద్దరిని అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.