- Advertisement -
ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న ఆశలు ఫలించాయి. అమీర్పేట్-హైటెక్ సిటీ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించారు గవర్నర్ నరశింహన్. గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం అమీర్పేట్ స్టేషన్లో జెండా ఊపి మెట్రోని ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా గవర్నర్ మెట్రో రైలును ఆరంభించారు. హైటెక్ సిటీ వరకు గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.