గుజరాత్లో ని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. అంబాజీ ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 50 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్ ప్రమాదానికి గురయ్యింది.అయితే భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు స్కిడ్ అవడం వలే లోయలో పడినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మోదీ ట్వీట్ చేశారు. మోదీతో పాటు ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.