- Advertisement -
హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆర్టీసీ(TSRTC) బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కిందకు దిగాలని అడిగినందుకు రెచ్చిపోయాడు. బస్సు దిగేదిలేదంటూ తోటి ప్రయాణికులతో గొడవపడ్డాడు. అంతే కాదు తన దగ్గరనున్న గన్తో ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు బస్సు రూఫ్ టాప్ నుంచి గాల్లోకి దూసుకెళ్లాయి.
ఈ ఘటనలో డ్రైవర్ బస్సు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గర చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.