Wednesday, April 24, 2024
- Advertisement -

హైవేపై అమ్మాయిల ఆట‌క‌ట్టించిన పోలీసులు….

- Advertisement -

హైవేల‌పై అందాల‌ను ఎర‌వేసి నిలువు దోపిడీ చేస్తున్న అమ్మాయిల ఆట‌క‌ట్టించారు గుంటూరుగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెల్తే గ‌త కొంత కాలంగా నేషనల్ హైవేపై ముగ్గురు మహిళలు.. నలుగురు పురుషులు కలిసి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.

నడిరోడ్డుపై అర్ధరాత్రి మాటువేసే కొందరు యువతులు, అందాలు ఒలకబోస్తూ, అటుగా వచ్చే వాహనాలను ఆపుతారు. అమ్మాయిలు ఆపుతున్నారన్న ఉద్దేశంతో ఎవరైనా వాహనం ఆపితే, వారిని మాటల్లో పెట్టి, వ్యభిచారం కోసం పక్కకు తీసుకెళతారు. వెంటనే ఆ పక్కనే నక్కివున్న నలుగురు వ్యక్తులు, దాడి చేసి వారి వద్ద ఉన్న డబ్బు, నగలు, సెల్ ఫోన్లు దోచేసుకుంటారు.

ఇంత జ‌రుగుతున్నా ప‌రువు పోతుంద‌ని ఎవ‌రూ కూడా పోలీసుల‌కు కంప్లైంటు చేయ‌లేదు. అయితే దీనిపై ఉప్పందుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం మాటువేసి ముగ్గురు యువతులను, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున తన సిబ్బందితో చినకోండ్రుపాడు కాటూరి మెడికల్‌ కళాశాల వద్ద మాటువేశారు.

తన్నీరు అంకమ్మరావు అనే వ్యక్తి, తన ఆటోలో కాటూరి వైపు వెళుతుండగా ఒక్కసారిగా యువతులు రోడ్డుపైకి వచ్చి చెయ్యెత్తారు. తమను చూసి ఆశపడ్డ అంకమ్మరావును వారు పక్కకు తీసుకెళ్లగానే, పురుషులు వచ్చి దాడి చేసి రూ. 4,750 నగదు, సెల్ ఫోన్ ను లాక్కున్నారు. దీన్ని చూస్తున్న పోలీసులు మెరుపుదాడి చేసి, వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 25 సంవత్సరాల లోపు వయసువారే కావడం గమనార్హం.

రహదారిపై రాత్రిపూట దోపిడీలు చేస్తున్న వీరిని చితల దుర్గా ప్రసాద్‌, దొడ్డా రాజకుమార్‌, వేముల అనిల్‌, జీ ఏసుబాబు, షేక్‌ మాబులా, అంగడి లక్ష్మి, వంతల తిరుపతమ్మ గా గుర్తించామని తెలిపారు. వీరు గతంలో సత్తెనపల్లి, పేరేచర్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా దోపిడీలు చేసినట్టు గుర్తించామన్నారు. నిందితులను రిమాండ్ కు పంపామని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -