Friday, March 29, 2024
- Advertisement -

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు అయ్య‌ప్ప భ‌క్తులు దుర్మ‌ర‌ణం..

- Advertisement -

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల నుంచి వస్తున్న ముగ్గురు అయ్యప్ప భక్తులు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప స్వాములు దుర్మరణం పాలయ్యారు. మ‌రో క‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన దినేశ్, సారథి, సుబ్బారావే అనే యువకులు మాల వేసుకుని అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని కారులో రాజమహేంద్రవరం వస్తుండగా చిలకలూరిపేట మండలం పాతపూడి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డే మ‌ర‌ణించ‌గా..సోమశేఖర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో ఆయనను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడం, అతివేగం ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -