ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్ప్రదేశ్లోని తన నియోజకవర్గం మిథౌలీ జరిగే ఓ కార్యక్రమానికి హేమమాలిని ఆదివారం వెళ్తుండగా ఈదురుగాలులు, ఉరుముల ప్రారంభమయ్యాయి. దీంతో చెట్టు విరిగి ఆమె ప్రయాణిస్తున్న వాహనం ముందుపడటంతో ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. అయితే ఆదివారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మధుర ఎంపీ హేమమాలిని మిథౌలీలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్తుండగా భారీ ఈదురుగాలల కారణంగా ఆమె కాన్వాయ్కి ముందు చెట్టు పడిపోయిందని పోలీసులు తెలిపారు. కొన్ని సెకన్లు ఆలస్యంగా చెట్టు నేలకూలింటే ఎంపీ కాన్వాయ్పై పడేదని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.
#Correction: Hema Malini is a BJP MP from #Mathura & not MLA as mentioned earlier. https://t.co/kkMZwFgAch
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 14, 2018