తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,176 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 26,84,215 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 81.42 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. కరోనా కట్టడి చర్యల విషయంలో రాష్ట్ర సర్కార్ హామీలు ఇస్తూ పోతోందని, కానీ వాటి అమలు విషయంలోనే సందేహాలు ఉన్నాయని హైకోర్టు కామెంట్ చేసింది. కరోనా టెస్టులను పెంచి మళ్లీ ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కరోనా పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రుల భారీగా దోచుకుంటున్నాయని.. ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫీజుల దోపిడీ, ఇతర అంశాలపై ఫైల్ అయిన పిల్స్ పై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రోజుకు 40వేల టెస్టులు చేస్తామని చెప్పి, ఇప్పుడెందుకు చేయడం లేదని నిలదీసింది. టెస్టులు తగ్గించడానికి కారణాలు ఏంటో చెప్పాలంది.
ఈ నేపథ్యంలో ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు తండ్రి మరణించారని, అందుకే రిపోర్టు ఇవ్వడం ఆలస్యం అవుతోందని చెప్పారు. వివరాలు ఇచ్చేందుకు టైమ్ కావాలని కోరారు. అక్టోబర్ 6 నాటికి రిపోర్టు ఇస్తే, అదే నెల 8న విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. పేపర్లలో వస్తున్న స్టోరీలను బట్టి ఆక్సిజన్ బెడ్స్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని హైకోర్టు పేర్కొంది. డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం వెయ్యి మందికి 5 ఆక్సిజన్ బెడ్స్ ఉండాలని, కానీ రాష్ట్రంలో ఒక్కటే ఉందని చెప్పింది.
తెలంగాణలో కరోనా జోరు.. కొత్తగా 2,176 కరోనా కేసులు!
జంటనగరవాసులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన సిటీ బస్సులు
బిగ్బాస్ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?