Thursday, April 25, 2024
- Advertisement -

వివాహేతర సంబంధం ఎఫెక్ట్…. భ‌ర్త ఏం చేశాడంటె….?

- Advertisement -

వివాహేతర సంబంధాలు… ప్రాణాలమీదకు తెస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది
అలాంటి అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం లేదు. ఇతరుల భార్యాలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని లేనిపోని సమస్యల్లో కొనితెచ్చుకుంటున్నారు. చివ‌ర‌కు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన ప‌డుతున్నా వివాహేత‌ర సంబంధాలు మాత్రం ఎక్కువ అవుతున్నాయే గాని త‌గ్గ‌డంలేదు.

కృష్ణాజిల్లాలో జ‌రిగిన అలాంటి సంఘ‌ట‌న ఓ వ్య‌క్తి ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిపై దాడికి భర్త దాడి చేయ‌డంతో భార్య ప్రియుడు తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. వివ‌రాల్లోకి వెల్తే….జిల్లాలోని గుడివాడ వాంబే కాలనీలో మురళీకృష్ణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన గంగరాజుతో ఇతనికి పరిచయం ఏర్పడింది.

అప్పుడప్పుడు గంగరాజు ఇంటికి వస్తూ పోయి ఉండేవాడు. ఈ క్రమంలో గంగరాజుకు మురళీకృష్ణ భార్యతో గంగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం భ‌ర్త ముర‌ళీకృష్ణ‌కు తెలియ‌డంతో ఇద్ద‌రికి వార్నింగ్ ఇచ్చారు. అయినా భార్య ప్ర‌వ‌ర్త‌నలో మార్పు రాక‌పోవ‌డంతోపాటు ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స‌హ‌నం కోల్పోయిన ముర‌ళీ గంగ‌రాజు ఇంటికెల్లి కళ్లలో కారం కొట్టి విచ‌క్ష‌ణా ర‌హితంగా కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాల‌తో అక్క‌డ‌నుంచి త‌ప్పించుకొని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేశాడు. అప్పటికీ కోపం చల్లారని మురళీ కృష్ణ గంగరాజు ఇంటి దగ్గర ఉన్న అతడి బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ముర‌ళీ కృష్ణ‌ను అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -