- Advertisement -
నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య దారుణ హత్య కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆర్సీపురానికి చెందిన లావణ్యను దుండగులు దారుణంగా హత్యచేశారు. మృతదేహాన్ని లగేజి బ్యాగులో కుక్కి సూరారంలోని ఓ కాలువ పక్కన పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య మిస్టరీని ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడు సునీల్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి విషయమై లావణ్య.. సునీల్పై ఒత్తిడి తెస్తుండటంతో అడ్డుతొలగించుకోవటానికే ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు.