Thursday, March 28, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లో దారుణ హ‌త్య‌..

- Advertisement -

హైద‌రాబాద్‌లో దారుణ హ‌త్య చోటు చేసుకుంది. కూకట్ పల్లి ప్రాంతంలో యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కైతలాపూర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.హత్యానంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతుడిని ఏసీ మెకానిక్ జున్నాడా రాధాకృష్ణ(38)గా గుర్తించారు.

గత శుక్రవారం నుంచి అతను కనిపించడం లేదని బంధువులు తెలిపారని అన్నారు. ఇతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం నుంచి శ్రీనివాస్ కనిపించకుండా పోయాడని బంధువులు చెబుతున్నారు.ఇంటినుంచి శ్రీనివాస్ ఎక్కడికెళ్లాడు?.. ఎవరి చేతిలో హత్యకు గురయ్యాడు వంటి వివరాలేవి ఇంకా తెలియరాలేదు. మృతుడి తలపై గాయాలు ఉండటంతో, హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -