హైదరాబాద్లో మసాజ్ సెంటర్ల పేరేతో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యభిచారంపై పక్కా సమాచారంతో ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ నేత్రుత్వంలో ‘ట్రాంక్విల్ యూనిసెక్స్ సెలూన్&స్పా’పై తుకారాంగేట్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెల్తే…ఈస్ట్ మారేడుపల్లిలోని రాజేష్ కుమార్ అనే వ్యక్తి ‘ట్రాంక్విల్ యూని సెక్స్ సెలూన్ అండ్ స్పా’ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మన్నపు శ్రావన్కుమార్, ఎల్క విద్యా సాగర్తో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి తుకారాంగేట్ పోలీసులు దాడులు నిర్వహించారు.నిర్వాహకులు శ్రావణ్కుమార్, విద్యాసాగర్, విటులు విద్యానగర్కు చెందిన పులుగుర్త సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్ కుమార్తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు, రూ. 13,040 నగదు స్వాధీనం చేసుకొని గురువారం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.