- Advertisement -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఆర్కేఎస్ భదౌరియాను నియమించింది కేంద్రం.దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ గా ఆయన ఉన్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న బీఎస్ ధనోవా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. అయితే అదే రోజు భదౌరియా పదవీ కాలం ముగియనుండగా ఆయనకు మూడేళ్లు సర్వీస్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొని ఐఎఎఫ్ చీఫ్ గా నియమించింది.