Thursday, March 28, 2024
- Advertisement -

వీడియో వైరల్: భారత్ దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగు

- Advertisement -

పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ అర్ధరాత్రి వేళ భారత్ లోకి ఉగ్రవాదులను పంపించడానికి కుట్ర పన్నింది. వ్యూహాత్మకంగా భారత ఆర్మీ కల్లుగప్పి వారు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే భారత జవాన్లు అలెర్ట్ గా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టారు. ఇది వీడియోల్లో రికార్డ్ కావడంతో వైరల్ గా మారింది.

తాజాగా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు వీడియోను విడుదల చేసింది.సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో అర్ధరాత్రి వేళ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని హాజీపూర్ లో ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి చొరబడడానికి విఫలయత్నం చేశారు. ఆ సమయంలో భారత సైన్యం గ్రేనెడ్లతో దాడి చేయడంతో ఉగ్రవాదులు తోకముడిచి పారిపోయారు.

అర్ధరాత్రి వేళ భారత్ లోకి చొరబాటుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న వీడియోను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ దెబ్బకు వారంతా పాకిస్తాన్ లోకి పరుగులు తీయడం కనిపించింది.

ఇది వరకే ఇద్దరు పాకిస్తాన్ సైనికులు ఇలానే భారత్ లోకి వచ్చి చనిపోగా వారి శవాలను తెల్లజెండాలను చూపించి పాకిస్తాన్ సైన్యం తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటన మరువక ముందే మరోసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించడానికి పూనుకోవడం భారత్ అడ్డుకోవడం నైట్ విజన్ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడియో ఇదే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -