- Advertisement -
ఐఎస్సీటీసీలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే.. ఇప్పుడే ఆ పని కానిచ్చేయండి. ఎందుకంటె రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ఐఆర్సీటీసీ మూతపడనుంది.శనివారం, ఆదివారాల్లో కొంత సమయం పాటు ఐఆర్సీటీసీ సేవలను నిలిపివేయనున్నారు. మెయింటినెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులకు కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు, ఢిల్లీలో ఇవాళ రాత్రి 11:45 నుంచి రేపు ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుందని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ అందించిన సమాచారం ప్రకారం తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు