దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె, నీతా అంబానీల గారాలపట్టి ఈషా అంబానీ వివాహానికి సర్వం సిద్ధమైంది. అంబానీల ఇంట్లో పెళ్లి అంటే చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారనే చర్చ దేశ విదేశాల్లో జరుగుతోంది.
ఎవరెవరు వస్తున్నారు, వధూవరుల దుస్తుల ఖరీదు ఎంత లాంటి విషయాలపై సహాజంగానే ఆసక్తి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే వెడ్డింగ్ కార్డ్ నుంచి పెళ్లికి భారీ ఏర్పాట్లు చేశాయి. అయితే ఇప్పుడీ వివాహానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తన ముద్దుల కుమార్తె వివాహానికి ముఖేశ్ అంబానీల సుమారు 100 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.718 కోట్లు) ఖర్చు పెడుతున్నారన్నది ఆ వార్త సారాంశం. ముకేష్ ఒక్కగానొక్క కూతురి కోసం ఇంత ఖర్చు చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
ఒకవేల ఈ వార్తలు నిజం అయితే ప్రపంచలో జరగబోయే ఖరీదైన రెండో పెళ్లిగా రాకార్డు సృష్టించనుంది. గతంలో 37 ఏళ్ల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్, డయానాల వివాహానికి 110 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
ఇవాళ ముంబైలోని ముఖేశ్ నివాసం యాంటీలియాలో ఈషా-ఆనంద్ పిరమల్తో వివాహాం జరగనుంది. ఇందుకోసం 27 అంతస్తుల ఈ భవంతిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహానికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలను చేపట్టారు. ఎంతైనా అంబానీల ఇంట్లో పెళ్లి అంటే ఆ మాత్రం ఉండదా…!