Tuesday, April 23, 2024
- Advertisement -

టీడీపీనేత‌ల‌పై ఐటీదాడుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుత‌న్న చంద్ర‌బాబు..

- Advertisement -

టీడీపీకీ ఐటీ అధికారులు మ‌రో షాక్ ఇచ్చారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ పై ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ముఖ్య‌మైన నాయ‌కుల‌పై ఐటీ దాడులు చేస్తూ బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఐటీ దాడులను ఆపేందుకు సీఎం చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు.

టీడీపీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన బాలాజీ గ్రూప్ కంపెనీల్లో నూ తమిళనాడులోని టి.నగర్‌లో ఉన్న ఆయన కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. అలాగే సవేరా హోటల్‌లో తనిఖీలు నిర్వహించగా అక్కడ భారీగా నగదు, బంగారం లభ్యమైనట్లు తెలుస్తోంది. దాడుల్లో ఐటీ అధికారులు ఆధారాలు లేని రూ. 55 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మాగుంట కంపెనీల్లో శుక్రవారం ఉదయం మొదలైన ఐటీ దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మాగుంట సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.ఐటీ దాడులపై ఇప్పటికైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఐతే ఐటీ దాడుల‌ను ఆపేందుకు బాబు శ‌త విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఐనా ఆగ‌క పోవ‌డంతో ఏపీలోకి సీబీఐ ప్రవేశానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు చంద్రబాబు. అయినా ఐటీ వదల్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కాకుండా చెన్నైలో దాడులు చేస్తోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐటీ లిస్ట్‌లో ఎంత‌మంది టీడీపీ మ‌డా నేత‌లు ఉన్నారో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -