Thursday, April 25, 2024
- Advertisement -

క‌శ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం… 23 మంది దుర్మ‌ర‌ణం

- Advertisement -

జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోవడంతో దాదాపు 23 మంది మరణిం చ‌గా 17 మంది గాయ‌ప‌డ్డారు. ఫూంచ్ జిల్లాలోని పలేరా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ప్రమాద స్థలం పూంచ్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. లోరన్ నుంచి పూంచ్ వెళుతున్న ఆర్టీసీ బస్సు… మండీ ఏరియా సమీపంలో ఉన్న లోయలోకి దూసుకుపోయింది. మూల మలుపు దగ్గర డ్రైవర్, బస్సు కంట్రోల్ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే మండి ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను అతి కష్టం మీద లోయలో నుంచి వెలికి తీశారు. బస్సు శిథిలాలు లోయలోని నది సమీపంలో పడడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం తెలుసుకున్న లోయకు దగ్గర్లోని గ్రామస్థులు ప్రమాదస్థలానికి చేరుకుని మృతదేహాలను లోయలో నుంచి రోడ్డు మీదకి చేర్చారు.

ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అత్యవసర చికిత్స అవసరం ఉన్న వారిని ఎయిర్ అంబులెన్స్‌లో జమ్మూకు తరలించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -