- Advertisement -
జమ్మూ,కాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్ర ఉగ్రవాదులు వేసిన భారీ ప్లాన్ ను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్మూ బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉంచిన బస్సులో దాదాపు 15 కిలోక ఆర్డీఎక్స్ను పోలీసులు గుర్తించారు. కథువా జిల్లా బిలావర్ నుంచి జమ్ముకు ఈ బస్సు చేరుకుందని అధికారులు తెలిపారు. బస్ డ్రైవర్, కండక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీఎక్స్ లభ్యం కావడంపై ప్రశ్నిస్తున్నారు.
ఆర్డీఎక్స్తో కూడని ప్యాకెట్ను బిలావర్లో తమకు ఓ జంట అప్పగించిందని బస్ డ్రైవర్ భద్రతా దళాలకు చెప్పినట్టు తెలిసింది. జమ్మూలో తమ బంధువులు ఆపెట్టెను తీసుకుంటారని మహిళ చెప్పిందని విచారణలో వెల్లడించారు. ఆర్డీఎక్స్ తో పాటు దేవల్ ప్రాంతంలో ఓ ఇంటినుంచి 40 కిలోక గన్ పౌడర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.