దేశంలో చిన్నారులపై రోజు రోజుకీ అత్యాచారాలు పెరిగిపోతూనె ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు కేర్ చేయడంలేదు. తాజాగా అభం శుభం తెలియని మూడే ళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడి ఆపై తల నరికి అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘోర సంఘటన జార్ఖండ్లోని జంషెడ్పూర్లోని టాటా నగర్ రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకుంది.
టెల్కో ప్రాంతంలో తల లేకుండా ఉన్న పాప మొండాన్ని పోలీసులు ఓ ప్లాస్టిక్ కవర్లో కనుగొన్నారు. బాలిక తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించడంతో విస్తుగొలిపే నిజాలు వెలుగు లోకి వచ్చాయి. బాలికను హత్య చేసే ముందు ఆమెపై పాశవికంగా అత్యాచార చేసినట్లు తేలింది. జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావమైందని, బాలిక తమను గుర్తిస్తుందేమో అన్న ఆందోళనతో నిందితులు ఆమెను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు
వివరాల్లోకి వెల్తే….పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ తన కూతురితో కలిసి రైల్లో జంషెడ్పూర్కు గత శుక్రవారం బయల్దేరింది. ఆ రోజు రాత్రి ఆమె, చిన్నారి కలిసి టాటానగర్ రైల్వేస్టేషన్లోనే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఆ విషయం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్కడున్న సీసీ పుటేజిని పరిశీలించిన పోలీసులు …పాపను ఎత్తుకెళ్లింది పాత నేరస్థుడు రింకూ అని గుర్తించి అతడితో పాటు మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఒకరు హత్య కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. 2015లో ఒక బాలికను చంపిన కేసులో అతను జైలుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.