Thursday, April 25, 2024
- Advertisement -

పాక్ దొంగదెబ్బ… జవాన్ వీరమణం

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ భారత్ పై అసహనంతో రగిలిపోతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా భారత్ పై ప్రతీకారానికి సిద్దమవుతోంది. అందర్జాతీయంగా పాక్ కు చుక్కెదురవడంతో ఇప్పుడు సరిహద్దుల్లో దొంగదెబ్బ తీయడానికి పావులు కదుపుతోంది.

తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. నౌషేరా, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ కాల్పుల్లోలాన్స్ నాయక్ సందీప్ థాపా (35) అమరుడయ్యారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను దీటుగా తిప్పికొడుతున్నాయి.

శనివారం ఉదయం 6.30 గంటలకు పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఓ ఉన్నతాదికారి తెలిపారు. తేలికపాటి ఆయుధాలు, షెల్స్‌ను పాక్ ప్రయోగిస్తోందని వెల్లడించారు. పాక్ దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -