- Advertisement -
ప్రముఖ పారీశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం కేసులో హైదరాబాద్ పోలీసులు స్పీడ్ పెంచారు. ఈకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేష్, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. ఆ ఇద్దరిని హైదరాబాద్ కు తరలించారు. ఈహత్యకేసుతో శ్రిఖా చౌదరికి ప్రమేయం లేదని ఏపీ పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే జయరాం భార్య మాత్రం శ్రిఖా ప్రమేయం ఉండొచ్చంటూ జూబ్లీ హిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా జూబ్లీ హిల్స్ పోలీస్లు కేసును విచారణ చేస్తున్నారు. నిందితులను సాయంత్రంలోగా హైదరాబాద్ నాంపల్లి కోర్టులో నిందితులను హాజరుపర్చనున్నారు పోలీసులు.