Friday, April 19, 2024
- Advertisement -

మరోసారి శివసేన పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కంగనా..?

- Advertisement -

బాలీవుడ్ లో తన నోటికి పనిచెప్పి చాలామంది సినీ తారలను నోరు మూసుకునేటట్లు చేసింది కంగనా.. ఇప్పుడు రాజకీయంగా అదే విధానాన్ని పాటిస్తూ దేశం మొత్తం ఓ వెలుగు వెలిగిపోతుంది.. ముంబై లోని పరిస్థితులపై కామెంట్స్ చేసి అక్కడి ప్రభుత్వం ఆగ్రహాన్ని చూరగొన్న కంగనా ఆ వివాదాన్ని రోజు రోజు కు మరింత ఎక్కువ చేసింది.. ఎప్పటికప్పుడు ఆమె శివసేన పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది..

ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ముంబైలోని తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చేశారు. కోర్టు ఆదేశాలతో కూల్చివేత పనులు ఆగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి కంగనా మహా సర్కార్ పై మండిపడింది.

చుట్టుపక్కల ఉన్నవారిని కూడా బీఎంసీ బెదిరిస్తోందని ఆరోపించారు. తనను ఒంటరిని చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తనకు సపోర్ట్ చేస్తే వారి ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరించిందని చెప్పింది కంగనా.

మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారెవరూ ఒక్క కామెంట్ కూడా చేయలేదని వారి ఇళ్లను కూల్చివేయద్దని విన్నవించింది. ముంబైలో గూండా ప్రభుత్వం నడుస్తోందని కంగన వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎవరూ ప్రశ్నించకూడదా? అని మండిపడింది. వాళ్లు మనల్ని ఏం చేస్తారు? ఇళ్లను కూల్చి, చంపేస్తారా? అని ప్రశ్నించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -