Saturday, April 20, 2024
- Advertisement -

నా మీద కోపం వాళ్ళ మీద ఎందుకు… కంగనా రనౌత్ ఆవేదన..?

- Advertisement -

గత కొన్ని రోజులుగా శివసేన, కంగనా రనౌత్ ల మధ్య జరుగుతున్న ఇష్యూ సంగతి అందరికి తెలిసిందే.. తన ఆఫీస్ ను సైతం కూల్చేసిన శివసేన కంగనా పై ఏ రేంజ్ యుద్ధానికి అయినా దిగేలా ఉంది. ఐటిహీ కోర్టు జోక్యం తో ఆఫీస్ కూల్చివేత పనులు ఆగిపోయాయి.. తాజాగా బీఎంసీపై కంగనా మరోసారి మండిపడింది.

తన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా బీఎంసీ బెదిరిస్తోందని ఆమె ట్వీట్ చేసింది. తనను ఒంటరిని చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. తనకు సపోర్ట్ చేస్తే వారి ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరించిందని చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారెవరూ ఒక్క కామెంట్ కూడా చేయలేదని… వారి ఇళ్లను కూల్చివేయద్దని విన్నవించింది.

ముంబైలో గూండా ప్రభుత్వం నడుస్తోందని కంగన వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎవరూ ప్రశ్నించకూడదా? అని మండిపడింది. వాళ్లు మనల్ని ఏం చేస్తారు? ఇళ్లను కూల్చి, చంపేస్తారా? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -