Thursday, March 28, 2024
- Advertisement -

మైన‌ర్ బాలిక‌పై బావ అత్యాచారం…భార్య చేసిన ప‌ని తెలిస్తే…?

- Advertisement -

మైన‌ర్ బాలిక‌ల‌పై రోజు రోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొత్త వ్య‌క్తుల‌కంటే సొంత బంధువ‌లే కామాంధులుగా మారుతున్నారు. వ‌రుస‌కు మ‌ర‌ద‌లు అయ్యే మైన‌ర్ బాలిక‌పై బావ అత్యాచారానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. బాలిక‌కు అండ‌గా ఉండాల్సిన ఆ కామాంధుడి భార్య మ‌రో నీచానికి వ‌డిగ‌ట్టింది.

వివ‌రాల్లోకి వెల్తే….కర్ణాటకలోని కోలార్‌ జిల్లా మలూర్‌ తాలూకా హునసికోట్‌లో గంగరాజు(32) భర్తను వదిలివేసిన పల్లవిని పెళ్లి చేసుకొని పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పల్లవికి చెల్లెలి వరుసయ్యే ఓ మైనర్ బాలిక(13) వీరితో కలసి ఉంటోంది.ఈ అమ్మాయిపై కన్నేసిన గంగరాజు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించాడు. ఈ విష‌యం భార్య ప‌ల్ల‌వికి తెలిసినా బాలిక‌కు అండ‌గా ఉండాల్సిందిపోయి ర‌హ‌స్యంగా సదరు యువతిని గంగరాజుకు ఇచ్చి రహస్యంగా పెళ్లి చేసింది. ఈ విషయం ఎలాగోలా బయటకు పొక్కడంతో కౌన్సెలర్‌, లీగల్‌ అడ్వైజర్‌తో కలిసివచ్చిన పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం స్వీకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు గంగరాజు, పల్లవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -