బెంగుళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓకుటుంబం అప్పుల్లో కూరుకుపోవడంతో తన కుటుంబంలోని నలుగురు వ్యక్తులను కాల్చిచంపి, తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణంగా భావిస్తున్నారు.కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది
వివరాల్లోకి వెల్తే….మైసూరుకు చెందిన ఓంకార్ ప్రసాద్ (33), తల్లిదండ్రులు నాగరాజ్ భట్టాచార్య (60), హేమలత (54), భార్య నికిత ( 27), కుమారుడు కృష్ణ (5)లతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ఓంకార్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఓంకార్ కొద్దిరోజుల క్రితం మైసూరు వదిలి కుటుంబ సభ్యులతో బందిపొరాలోని యేచెట్టి గ్రామంలో ఉండే ఫామ్ హౌస్కు వెళ్లాడు.
అక్కడనుంచి కుటుంబంతో చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట సమీపంలోని నంది హోటల్కు మూడు రోజుల క్రితం వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలసి అక్కడే ఉంటున్నారు.ఈ నేపథ్యంలో కారు డ్రైవర్కు ఎటువంటి అనుమానం రాకూడదని ముందుగా అతన్ని వేరే పనిపై బయటకు పంపించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుండ్లుపేట పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉన్న శివారు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులను కాల్చి, తానుఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే అప్పుల వల్లే ఓంకార్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.