Saturday, April 20, 2024
- Advertisement -

8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఆర్మీ..

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పగతో రగిలిపోతున్న పాక్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ద్వాదా అల్లర్లు చేయించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉగ్రవాదుల తిష్టవేసి ఉన్నారు. కాశ్మీర్ లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవిధంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా దక్షిణ కశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో 8 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారం అరెస్టు చేశాయి.

ఈ 8మంది ఉగ్రవాదులు హెచ్చరికలతో కూడిన పోస్టర్లను అతికిస్తుండగా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి కంప్యూటర్లతో పాటు పోస్టర్ల తయారీకి సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.రెస్టు అయిన వారిని అయాజ్‌ మీర్‌, ఓమర్‌ మీర్‌, త్వాసిప్‌ నజర్‌, ఇంతియాజ్‌ నజర్‌, ఓమర్‌ అక్బర్‌, ఫైజాన్‌ లతీఫ్‌, దానీష్‌ హబీబ్‌, అహ్మద్‌ మీర్‌గా బలగాలు గుర్తించాయి.

స్థానికి ప్రజలపై దాడులు చేయింది వారిని హతమార్చిన కేసుల్లో వీల్లు నిందితులని పోలీసులు తెలిపారు. సాజిద్ మిర్ అనే ఉగ్రవాది ఆదేశానుసారం వీల్లు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -