- Advertisement -
దేశంలో ఉగ్రదాడులు చేయాలని పాక్ పన్నుతున్న పన్నాగాలను భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. తాజాగా కాశ్మీర్ 40 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. కథువా ప్రాంతంలోని దివాల్ గ్రామం నుంచి వాటిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్మీ ఇంటెలిజెన్స్ దళాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా అనుమానిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా దేశీయంగా తయారుచేసిన పేలుడు పదార్ధాలు లభించాయి.