Tuesday, April 23, 2024
- Advertisement -

పాపులారిటీ కోసం అరుదైన వాటిని చంపి తిన్నారు..చివరికి..?

- Advertisement -

ఏదేశమైనా, ఎక్కడైనా కొంతమంది తమ పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా పాపులైటీ సంపాదించుకోవాలని అని చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశాలు. అందుకు ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. బియ‌ర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఫార్మాట్ లో కాంబోడియాకు చెందిన ఫౌన్ రాటీ అనే వ్య‌క్తి త‌న భార్య ఆహ్ లిన్ ట్యుక్‌ తో కలిసి యూట్యూబ్ లో నాచుర‌ల్ లైఫ్ టీవీ పేరు తో ఒక ఛానల్ క్రియేట్ చేసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగానే ప్రోగ్రాం చేయడం మొదలు పెట్టారు.

పక్షులు, కింగ్ కోబ్రా, కప్పలు, షార్క్ ల తో పాటు  కొన్ని చాలా అరుదైన జాతులకు చెందిన అంతరించిపోతున్న జీవులని చంపి తిని సర్వైవల్ వీడియోస్ పేరుతో ఆ వీడియోస్ ని తమ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోస్ చూసిన వాళ్ళు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ప్రాంతం యొక్క పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఫౌన్ రాటీ, ఆహ్ లిన్ ట్యుక్‌ ని అరెస్ట్ చేశారు.

వాళ్ళిద్దరూ తాము కేవలం పాపులారిటీ, పేరు కోసం మాత్రమే ఇలా చేశామని, ఆ వీడియోల ద్వారా దాదాపు ఐదు వందల డాలర్లు సంపాదించామని చెప్పారు. అలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు. యూట్యూబ్ యాజమాన్యం వాళ్ల ఛానల్ లో ఉన్న, ఫిర్యాదు చేసిన వీడియోలను తొలగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -