Friday, March 29, 2024
- Advertisement -

ఆర్టీసీ నష్టాలు.. ఓలెక్ట్రా నిందలు.. అసలు నిజాలు ఇవే..

- Advertisement -

ప్రకృతిని కాపాడాలని కేంద్రం నడుం బిగించింది. కాలుష్యాన్ని వెదజల్లే ప్రభుత్వ సర్వీసులను తగ్గించాలని యోచించింది. అందులో భాగంగానే ప్రభుత్వ రవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను పెట్టాలని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సూచించింది. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోని 64 నగరాల్లో ఈ బస్సుల వినియోగించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిధులు విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. వారి మార్గదర్శక సూత్రాల ప్రకారం బస్సులు నడపాలి. ఇందుకోసం ఈ టెండరింగ్ విధానాన్ని స్పష్టంగా కేంద్ర నిర్ణయించింది. బస్సుల అర్హత వాటి శక్తి సామర్థ్యాలు నిర్ణయించేందుకు ఉన్నతస్థాయి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జారీ చేసిన టెండర్ ఉంది. ఇందుకు సంబంధించి 110 పేజీల ఈ టెండర్ ఆహ్వాన పత్రం లేదా 237 పేజీల ముసాయిదా రాయితీ ఒప్పందాన్ని పరిశీలిస్తే టిడిపి చేస్తున్న ఆరోపణలు ఎంత విచిత్రమైనదో విస్తుపోకతప్పదు. బస్సుల ఎంపిక, ప్రోత్సాహాకాలు, సేకరించే బస్సుల సంఖ్య మొదలైన అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ లేదు. కేంద్రం నిర్ణయించిన ఆదేశాలను అమలు చేయాల్సిందే.

ఇక తెలంగాణ విషయానికి వద్దాం.. తెలంగాణలోనూ పర్యావరణ హితం కోసం ఆర్టీసీ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను కొనకుండా కేవలం 40 బస్సులను అద్దె ప్రాతిపదికన మేఘా సంస్థ భాగస్వామిగా ఉన్న ‘ఓలెక్ట్రా’ బస్సులను అద్దెకు తీసుకుంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘ పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసెస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మర్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, కొందరు సోషల్ మీడియాలో మేఘా వల్లే నష్టం అంటూ చేస్తున్న ఆరోపణలు ఎంత వరకు నిజమో ఈ లెక్కలను బట్టి తెలుసుకోవచ్చు..

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ ఎంత మాత్రం నిజం లేదన్నది వాస్తవ పరిస్థితులు చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం.. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని ఆర్టీసీ నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది తెలంగాణ, ఏపీలో కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది.

ఇందులో మేఘా కంపెనీ 3500 కోట్లు స్వాహా చేశారంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. ఇందులో ఓలెక్ట్రా 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -