కొద్ది రోజుల క్రితం కాఫి విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన హార్దిక్, రాహుల్ను కష్టాలు వెంటాడుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురయిన ఇద్దరు ఆటగాళ్లు.. కొద్ది రోజుల్లోనె వారిపై ఉన్న నిషేధం బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే వారు చేసిన వ్యాఖ్యలపై పూర్తి విచారణ చేయాలని బీసీసీఐ అంబుడ్స్మన్ నియామకం తర్వాత విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
బీసీసీఐ అంబుడ్స్మన్ కమిటీ ఛైర్మెన్గా సుప్రీంకోర్టు డీకె జైన్ను నియమించింది. తాజాగా జైన్ సారథ్యంలోని కమిటీ హార్దిక్, రాహుల్లకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. దీంతో కొన్ని ఐపీఎల్ మ్యాచ్లకు దూరం కావాల్సిఉంది. దీంతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చిస్తోందని ఉన్నతాధికారు ఒకరు చెప్పారు. కీలక ఐపీఎల్, ప్రపంచకప్ నేపధ్యంలో ఈ వివాదం మరో సారి తెరపైకి రావడం హార్ధిక్, రాహుల్కు ఇబ్బంది కలిగించే విషయమే.