Friday, April 19, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం..విద్యార్థిని, మ‌హిళా వార్డ‌న్ ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుఉంది. గంట‌ల వ్య‌వ‌ధిలో విద్యార్థిని, మ‌హిళా వార్డ‌న్ ఆత్య‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెల్తే….ప‌ట్ట‌ణంలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ద్రాక్షాయిని(17), అక్కడి హాస్టల్‌ వార్డెన్‌ ఎం.పుష్పావతి (24) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ద్రాక్షాయిని(17) శనివారం అర్ధరాత్రి హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ద్రాక్షాయిని తండ్రి నాగేశ్వరయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ద్రాక్షాయిని అందరికంటే చిన్నది. ఆమె సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో బైపీసీ సెకండియర్‌ చదువుతూ హాస్టల్‌లోనే ఉండేది.

అయితే శనివారం రిపబ్లిక్ డే కావడంతో అందరు విద్యార్థినులతో పాటు దాక్షాయిని కూడా హాస్టల్లోనే వుంది. ఈ క్రమంలో ఏమయ్యిందో ఏమో గానీ అర్థరాత్రి సమయంలో హాస్టల్లోనే ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఆహారం సరిగా తీసుకోలేదని, అల్సర్‌తో బాధపడుతుండేదని తల్లిదండ్రులు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ విషయంపై పోలీసుల‌కు స‌మాచారం అందించింది వార్డెన్ పుష్పావ‌తి. పోలీసులు వ‌చ్చి ద్రాక్షాయినిమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ద్రాక్షాయిని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన హాస్టల్‌ వార్డెన్‌ పుష్పావతి కూడాఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు ఆమె జాడ కోసం గాలించగా… కేసీ కెనాల్‌కు సమీపంలో శవమై కనిపించింది. రక్షణ కోసం ఏర్పాటుచేసిన కంచె పైపుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ అక్క‌డున్న వారంద‌రినీ కంట‌త‌డి పెట్టించింది.

విద్యార్థిని ద్రాక్షాయిని, ఈమె ఇద్దరూ స్నేహితులుగా ఉండేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. విషయం తెలిసి కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈవిష‌యంపై క‌ళాశాల యాజ‌మాన్యం స్పందించ‌లేదు. పోలీసులు వీరిద్దరి ఆత్మహత్యలకు గల సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -