తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ప్రలోభాలు అధికంగా ఉందన్నారు. ప్రజల నాడి ప్రతిక్షణానికి మారిపోయిందన్నారు లగడపాటి రాజగోపాల్. ఆర్జీ ఫ్లష్ టీమ్ సెప్టెంబర్ నుండి పలు దఫాలుగా సర్వే నిర్వహించినట్టు ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో 68.5 శాతం నమోదైంది. ఈ దఫా 72 నుండి శాతం ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణ గ్రామాల్లో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా ఖర్చులు పెరిగాయని ఆయన చెప్పారు.
ప్రజాకూటమి 65 ప్లస్ / మైనస్ పది స్థానాలు గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ 35 స్థానాలు ప్లస్ / మైనస్ పది సీట్లు గెలవొచ్చని చెప్పారు. బీజేపీ ఐదు నుంచి ఏడు స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో ఐదు నుంచి 9 సీట్లు గెలవొచ్చిన చెప్పారు.
మరో వైపు జాతీయ సర్వేలన్నీ టీఆర్ఎస్కే పట్టం కడితే….దానికి విరుద్దంగా లగడపాటి మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా చెప్పారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు.