Tuesday, April 23, 2024
- Advertisement -

స‌ర్వేల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నా స‌ర్వేల రారాజు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌..

- Advertisement -

ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న స‌ర్వేఫ‌లితాలు పూర్తిగా త‌ప్పురావ‌డంతో ఇప్ప‌టికే పార్టీల నాయ‌కులు, కార్య‌ర్త‌ల‌నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. మ‌రో వైపు ల‌గ‌డ‌పాటిని సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. క‌నిపిస్తే కొట్టేంత క‌సిగా ఉన్నారు ఆంధ్రా ప్ర‌జ‌లు. దీంతో ఇక స‌ర్వేల‌కు స్వ‌స్తి చెప్పారు.ఈ మేరకు లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

గురువారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నెటిజనులు లగడపాటిని టార్గెట్ చేశారు. లగడపాటి నీవెక్కడంటూ ట్రోల్ చేశారు. 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు పది సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసిన సంగతి తెలిసిందే.తిపక్ష వైసీపీకి ఏడు స్థానాలు అటు ఇటుగా 72 సీట్లు వస్తాయని తెలిపారు. అయితే వైసీపీ 151 సీట్ల మెజారిటీతో దూసుకుపోయింది. ఇక ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌కు గుడ్ బైయ్ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -