- Advertisement -
పుల్వామాలో దాడి ఘటన మరువక ముందే ఎల్ఓసీ వద్ద మరో పేలుడు జరిగింది. ఈ పేలుడులో మేజర్ స్థాయి అధికారి దుర్మరణం పాలయ్యారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషెరాలో శనివారం (ఫిబ్రవరి 16) సాయంత్రం ఈ దారుణం జరిగింది. ఎల్వోసీ నుంచి 1.5 కి.మీ. లోపల ఉగ్రవాదులు అమర్చిన బాంబును నిర్వీర్యం చేసె ప్రయత్నంలో పేలుడు సంభవించింది. పుల్వామా ఘటన నేపథ్యంలో నిఘా పటిష్టం చేసిన భద్రతా దళాలు.. సరిహద్దు వెంట ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే దీనిపై పేర్తి సమాచారం తెలియాల్సిఉంది.