- Advertisement -
మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈస్ట్ ఢిల్లీలో అనుమతి లేకుండానే.. గంభీర్ ర్యాలీ నిర్వహించడాన్ని ఈసీ తప్పుపట్టింది. దీంతో గంభీర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈస్ట్ ఢిల్లీ రిటర్నింగ్ ఆఫీసర్ గంభీర్ పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ప్రస్తుతం గంభీర్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు.అంతకుముందు గంభీర్ కు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.