Tuesday, April 23, 2024
- Advertisement -

పెళ్లి చేసిన పురోహితునితో లేచిపోయిన న‌వ వ‌ధువు..

- Advertisement -

పెల్లి ఇష్టం లేపోయినా పెళ్లి అయిన‌ త‌ర్వాతైనా ప్రేమించిన ప్రియుడితో న‌వ వ‌ధులు లేచిపోవ‌డం చాలా సంద‌ర్భాల్లో జ‌రిగింది. కాని ఇప్పుడు వింటున్న సంఘ‌ట‌న మాత్రం అరుదుగా జ‌ర‌గుతుంటాయి. పెళ్లి చేసిన పురోహితుడితో న‌గ‌లు, డ‌బ్బుల‌తో లేచిపోయిందో న‌వ వ‌ధువు.ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌లో చోటుచేసుకుంది.ఈ విష‌యం తెలిస్తే త‌ల్లి దండ్రులు ప‌రువు పోతుంద‌ని త‌ల్లిదండ్రులు భావించ‌గా పెళ్లికోడుకు మాత్రం పోలీస్ స్టేషన్‌కు వెల్లి ఫిర్యాదు చేయ‌డంతో ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెల్తే….విధిష జిల్లాలోని సిరోంజ్‌ పట్టణానికి చెందిన యువతికి ఈ నెల 7న వివాహయ్యింది. వినోద్‌ మహరాజ్‌ అనే పూజారి మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారిఇంటికి వచ్చింది.వధువు కూడా వ్యక్తిగత కారణాలు చెప్పడంతో.. అత్తింటివారు అభ్యంతరం చెప్పలేదు.

తర్వాత సీన్ కట్ చేస్తే.. ఈ నెల 23న వధువు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. త‌ల్లి దండ్రులు ఆరా తీసినా ఫ‌లితం లేకుండా పోయింది. త‌ర్వాత ఆరా తీస్తెఅనంతరం ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని పెళ్లి చేసిన పురోహితుడితో లేచ‌పోయింది.

వధువు పరారైన తల్లిదండ్రులు పరువు పోతుందని భావించారు. కానీ ఆమె భర్త మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్‌ మహరాజ్‌ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితిడుకి, న‌వ వ‌ధువుకు రెండు సంవ‌త్స‌రాలుగా ప‌రిచ‌యం ఉంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. వారిద్ద‌రికోసం పోలీసులు వేట ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -