వివాహితతో అక్రమసంబంధం కారణంగా ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… భర్తకు దూరంగా ఉంటున్న ఓ యువతి, చిలకలూరిపేట పక్కనే ఉన్న మురికిపూడి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం కొనసాగిస్తోంది. అదే సమయంలో ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాబావలి (29) మురికిపూడిలో బిస్మిల్లా చికెన్ సెంటర్ పేరుతో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. మహిళ చికెన్ షాప్కు వెల్తున్న క్రమంలో షేక్ ఖాదర్ కు కూడా దగ్గరయ్యింది. పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న వేమవరం గ్రామ యువకుడు గత కొన్ని రోజులుగా బాబావలితో గొడవ పడుతున్నాడు.
ఇటీవలె మద్యం సేవించి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అయితే బాబావలిని అడ్డు తొలగించుకోవాలని వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తి నిర్ణయించుకున్నాడు. పూటుగా మద్యం సేవించిన బాబావలి సొంత గ్రామానికి వెల్లకుండా తన చికెన్ షాపులో నిద్రపోయాడు. అదే సమయంలో వేమవరం యువకుడు మహిళ ఇంటికి వెళ్లి బాబావలితో సంబంధం వదులుకోవాలని హెచ్చరించాడు. తన మాట వినని పక్షంలో బాబావలిని హత్యచేస్తానని మహిళను బెదిరించాడు. అదే సమయంలో మద్యం మత్తులోనే చికిన్ దుకాణానికి చేరుకొని షట్టర్ పైకి లాగి మద్యం మత్తులో నిద్రిస్తున్న బాబావలిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. ఉదయం ఎతటైం అయినా గాని షట్టర్ తీయకపోవడంతో బాబావలి బందువులు దుకాణం షట్టర్ తెరిచారు. రక్తపు మడుగులో ఉన్న అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.