Thursday, March 28, 2024
- Advertisement -

మూడేళ్ల కిందట చనిపోయిన కొడుకు తిరిగి వచ్చాడు..!

- Advertisement -

తమ కొడుకు మూడేళ్ల కిందటే చనిపోయాడని అంత్యక్రియలు జరిపారు. కొడుకు పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలో పోలీసుల్ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చింది. “మీ అబ్బాయి వచ్చాడు.. ఇంటికి తీసుకెళ్లండి” అని చెప్పగానే వారు ఆశ్చర్యపోయారు. మూడేళ్ల కిందటే చనిపోయిన తమ కొడుకు మళ్లీ ఎలా వచ్చాడు ? అసలు ఆ అబ్బాయి తమ కొడుకేనా ? అనుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

ఆ అబ్బాయిని చూడగానే ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అతడు తమ కొడుకే. మరి.. మూడేళ్ల కిందట అంత్యక్రియలు జరిపిన శవం ఎవరిదనే ప్రశ్న వారి మెదడులో మెదిలింది. మూడేళ్ల కిందట ఇంటి నుంచి పారిపోయిన ఉదయ్ అనే యువకుడు.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికి తిరిగివచ్చాడు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ.. ‘‘నన్ను ఓ దొంగతనం కేసులో ఇరికించాలని చూడటంతో ఢిల్లీ పారిపోయాను. లాక్‌డౌన్ వల్ల అక్కడ జీవించడం కష్టమైంది. దీంతో ఇంటికి తిరిగి వచ్చేశాను’’ అని తెలిపాడు.

సబ్ డివినల్ పోలీస్ ఆఫీసర్ సీతారాం అవసయ్యా మాట్లాడుతూ.. ‘‘2017లో ఉదయ్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులకు ఓ అస్థిపంజరం పోలీసులకు కనిపించింది. గుర్తుపట్టలేని విధంగా ఆ అస్థిపంజరం ఉంది. అయితే ఆ అస్థిపంజరపై ఉన్న దుస్తులను చూసి ఉదయ్ తండ్రి.. ఆ శవం తన కొడుకుదేనని భావించాడు. దాంతో దానికి అంత్యక్రియలు జరిపారు. అందుకే అతడు అంతా చనిపోయాడని అనుకుంటున్నారు’’ అని తెలిపారు. ఏది ఏమైన లాక్ డౌన్ వల్ల ఆ యువకుడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఆ అస్థిపంజరం ఎవరిదో తెలుసుకొనేందుకు పోలీసులు ఆ కేసును మళ్లీ పరిశీలిస్తు్న్నారు. అలాగే, ఉదయ్‌పై నమోదైన కేసును కూడా పరిశీలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -