Saturday, April 20, 2024
- Advertisement -

భార్య,భర్తల మధ్య గొడవ….కన్నబిడ్డ గొంతు కొరికి చంపిన కిరాతక తండ్రి..

- Advertisement -

భార్య మీదున్న కోపంతో కన్న బిడ్డ పట్ల కర్కశంగా వ్యవరించాడో తండ్రి. ఇద్దరి మధ్య గొడవులకారణంగా నాలుగేళ్ల కన్నబిడ్డ భార్యకు దక్కకుండా ఉండేందుకు ఉన్మాదిలా మారి కొడుకు గొంతు నులిమి, కొరికి చంపేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెల్తే….సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన చింతల కనకయ్య, స్వప్న దంపతులకు కూతురు అక్షిత (6), కొడుకు అక్షయ్‌ (4) ఉన్నారు. బతుకు దెరువు కోసం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో కొడుకును తీసుకొని కనకయ్య నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలోని తన పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చేశాడు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

అక్షయ్‌ బాగోగులు చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యులు కన్నయ్య భార్య స్వప్నకు రాములు కుటుంబం ఫోన్ చేసి చెప్పారు. నాలుగైదు రోజుల్లో వచ్చి తీసుకెల్తానని స్వప్న తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న కన్నయ్య కోపంతో రగిలిపోయాడు. కొడుకు భార్యకు దక్కకూదన్న ఉద్దేశ్యంతో ….గురువారం బోనాల జాతర ఉండటంతో ఫుల్లుగా మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికొచ్చాడు. నిద్రిస్తున్న కుమారుడిని గొంతు నులిమడంతో పాటు పంటితొ గట్టిగా కొరికేశాడు. నొప్పితో విలవిల్లాడి పోయిన కొడుకు ప్రాణాలు వదిలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -