Tuesday, April 23, 2024
- Advertisement -

వ‌దిన‌తో అక్ర‌మ సంబంధం…భ‌ర్త చివ‌ర‌కు ఏమ‌య్యాడంటె…?

- Advertisement -

వివాహేత‌ర సంబంధాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. అక్ర‌మ సంబంధం కార‌ణంగా భార్య‌లు భ‌ర్త‌ల‌ను కిరాత‌కంగా చంపుతున్న సంఘ‌ట‌న‌లు జ‌ర‌గుతూనె ఉన్నాయి. తాజాగా మ‌రిదితో అక్ర‌మ సంబంధానికి అడ్డు వ‌స్తున్నాడ‌ని తాళి క‌ట్టిన భ‌ర్త‌ను ప్రియుడితో హ‌త్య చేయించింది.

వివ‌రాల్లోకి వెల్తే…డిండి మండలం దేవత్ పల్లితండాకు చెందిన బానోవత్ దులియా అలియాస్ శంకర్ భార్య విజయ తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్య పురి యాదవనగర్ లో నివసిస్తున్నాడు.విజయ మరిది వరసయ్యే సపావత్ కిషన్ తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబందం పెట్టుకుంది. ఈ విష‌యం తెలిస‌న భ‌ర్త శంక‌ర్ ప‌లు సార్లు మంద‌లించినా భార్య‌లో మార్పు రాక‌పోవ‌డంతో అతడి అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది.

గత శనివారం రాత్రి తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ తన ప్రియుడు సపావత్ కిషన్ తో కలిసి అతడి ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం శంకర్ కరెంట్ షాక్ తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. భార్య విజ‌య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో శంక‌ర్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న మృతుడు భార్య విజయ, ప్రియుడు సపావత్ కిషన్ ను బుధవారం అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో శంక‌ర్‌ను తామె హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -